లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) మానవత సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కళాశాలలో తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యార్ధులకు యునిఫామ్స్, బుక్స్ పంపిణి చేసారు. ఈ సందర్భంగా విధ్యార్ధులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ విద్యార్ధులు అంతా లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దానిని చేదించే విధంగా కృషి చేయాలని అన్నారు. డా. బి ఆర్ అంబేద్కర్ , డా బాబు జగ్గజీవన్ లాంటి మహా వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని అన్నారు. భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. పారిస్ లో జరిగే ఒలింపిక్స్ లో ఈసారి తణుకు నుండి 4*400 రిలే లో పాల్గొనేందుకు వెళ్ళిన దండి జ్యోతిక శ్రీ కు గతంలో ఎమ్యెల్యే గా ఉన్న సమయంలో మొదటగా నేషనల్స్ కి పంపించడం జరిగిందని నాడు 1 లక్ష రూపాయలు ఇచ్చి ప్రోత్సహించడం జరిగిందని నేడు ఒలింపిక్స్ లో పాల్గొనడం మనకెంతో గర్వకారణమని అటువంటి స్పూర్తితో ముందుకు సాగాలని విద్యార్ధులకు సూచించారు. బానిస అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు.
*విద్యార్ధులకు యునిఫామ్స్ , స్కూల్ పుస్తకాలు అందించిన తణుకు ఎమ్యెల్యే ఆరిమిల్లి*
29
Jul