లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు) కలెక్టర్ ఆఫీస్ దగ్గర జెసి కి ఆల్ ఇండియా పూలే అంబేడ్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలని అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులు వినియోగించాలని డిమాండ్ చేశారు. పట్టణాలలో వసూలు చేస్తున్న పనుల్లో ఎస్సీ ఎస్టీలకు నిధులు కేటాయించి సక్రమంగా అమలు చేయాలని జెసి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ లో ఎస్సీ ఎస్టీలకు నిధులు కేటాయించడం లేదని కేటాయించిన సక్రమంగా అమలు చేయలేదని అమలు చేసే విధంగా అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, శేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు.
దళిత బంధు పధకాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాలి – పొట్ల సురేష్
09
Oct