EPFO వేతన పరిమితి పెరిగితే ఏమవుతుందో తెలుసా..?

Employees Provident Fund Organization వేతన పరిమితిని పెంచాలని central government భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 15 వేల రూపాయల పరిమితిని 21 వేల రూపాయలకు పెంచాలని కేంద్రం యోచిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి EPFO లో సభ్యులుగా ఉన్న ఉద్యోగులు వేతన పరిమితిని పెంచాలని ఎప్పటి నుంచో demand చేస్తున్నారు. central government చివరిసారిగా 2014లో PF వేతన పరిమితిని పెంచగా.. రూ.6,500 నుంచి రూ.15,000కి మార్చింది. మరియు 1952లో, EPFO  పథకం ప్రారంభమైంది. అప్పటి నుండి, ఇది మొత్తం 8 సార్లు పెరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

EPFO వేతన పరిమితిని పెంచితే కంపెనీల యాజమాన్యాలపై భారం పడినా.. ఉద్యోగులకు లాభం. ఉద్యోగి మూల వేతనం, DA ఆధారంగా provident fund కు నగదు మొత్తాలను జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉద్యోగి జీతం నుంచి 12 శాతం, యజమాని జీతం నుంచి మరో 12 శాతం PF ఖాతాలోకి వెళ్తాయి. దీని వేతన పరిమితి ప్రస్తుతం రూ.15,000.

వేతన పరిమితి ఈపీఎఫ్ఓ: ఉద్యోగుల పీఎఫ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) కింద ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 15 వేలు. ఇప్పుడు 40 శాతం పెరిగి రూ. 21 వేలకు పెంచుతారని ప్రచారం జరుగుతోంది. ఈ వేతన పరిమితిని పెంచాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్లు వస్తున్నా కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Related News

>> ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వేతన పరిమితి పెంపు వల్ల ప్రభుత్వంతో సహా ప్రైవేట్ రంగంపై అదనపు భారం పడుతుందని చెప్పవచ్చు. దీంతో ఉద్యోగులకు మేలు జరుగుతుంది.

>> EPFO గరిష్ట పరిమితిని చివరిసారిగా 2014లో సవరించడం గమనార్హం. ఆ తర్వాత రూ. 6500 పరిమితి రూ. 15 వేలకు పెంచారు. అంటే దాదాపు పదేళ్లుగా వేతన పరిమితి రూ. 15 వేలు అంతే. ఇదే క్రమంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఇప్పటికే వేతన పరిమితిని రూ. 21 వేలకు పెంచారు. దీంతో ఆ మొత్తానికి ఈపీఎఫ్ కూడా జోడించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

ఉద్యోగులకు ప్రయోజనం ఎలా?

పీఎఫ్ వేతన పరిమితిని పెంచితే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ అయ్యే మొత్తం కూడా ఆ మేరకు పెరుగుతుంది. సాధారణంగా జీతంలో 12 శాతం ఉద్యోగి వాటాగానూ, 12 శాతం యజమాని వాటాగానూ చెల్లించడం తెలిసిందే. ఉద్యోగి వాటా 12 శాతం మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. ఇంకా, ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కేంద్రం దీనిపై వడ్డీని వసూలు చేస్తుంది. కానీ పింఛను పథకంలో యజమాని వాటా నుంచి 8.33 శాతం.. మిగిలిన మొత్తం ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. ఇప్పుడు గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా తదనుగుణంగా పెరుగుతుంది. తద్వారా ఈపీఎఫ్‌ఓ, ఈపీఎస్‌ ఖాతాల్లో జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో తన PF ఖాతాలో బ్యాలెన్స్ పెంచుకోవడానికి ఇది సహాయపడుతుంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *