లీడర్ భాస్కర్ న్యూస్ :-తూర్పుగోదావరి జిల్లా…
ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. గత సంవత్సర కాలంగా ఎన్నో వివాదాల నడుమ ఉన్న పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ నేడు పరిష్కారమై విగ్రహావిష్కరణకు నోచుకున్న వేళ ఈ సంఘటన జరగటం విచారకరం. ఎంతో ఆనందంతో గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సోమవారం విగ్రహావిష్కరణ ఏర్పాట్లు జరుగుతున్న విషాదం జరిగింది.
పాపన్న గౌడ్
విగ్రహావిష్కరణలో భాగంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంటు షాక్ కు గురై నలుగురు యువకులు మృతి.
మృతులు వివరాలు.. వీరిలో ముగ్గురికి వివాహాలు అయ్యాయి.
1. బొల్లా వీర్రాజు
2. పామర్తి నాగేంద్ర.
3. మారిశెట్టి మణికంఠ.
4. కాసగాని కృష్ణ
మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
తీవ్ర గాయాల పాలైన కోమటి అనంతరావు తణుకు ఏరియా ఆసుపత్రికి తరలింపు. కేసు దర్యాప్తు చేస్తున్న ఉండ్రాజవరం పోలీసులు.