నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో 200 మంది జనసేన పార్టీలో చేరిక…

లీడర్ న్యూస్ (నరసాపురం) జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఆశయాలు నచ్చి కొప్పర్రు గ్రామానికి చెందిన 200మంది పార్టీలో చేరినట్లు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. ఈ సందర్బంగా నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో కొప్పరు గ్రామానికి చెందిన వైసిపి నాయకులు పోలిశెట్టి శేషు పోలిశెట్టి మధు చిన్నమిల్లి బాబులు అందే కవి ల ఆధ్వర్యంలో యాదంరెడ్డి సూరిబాబు, అందే భాస్కరరావు, కడలి ఏసుబాబు, గుబ్బల ఏడుకొండలు, కడలి ముత్యం జాయుడు , పీతల శాంసన్ సుమారు 200 మంది వైసీపీ శ్రేణులు జనసేన పార్టీలోకి చేరారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్  కొత్తపల్లి సుబ్బారాయుడు, డిసిఎంఎస్ చైర్మన్  చాగంటి చిన్నా కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్  సిద్ధాంతా

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Leader Bhaskar News

లు నచ్చి పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *