లీడర్ న్యూస్ (తణుకు) మాజీ మంత్రి, బీసీ నాయకుడు జోగి రమేష్ అరెస్ట్ అన్యాయమని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు విమర్శించారు. ఈ మేరకు తణుకు వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కారుమూరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 16 నెలల పరిపాలనా కాలంలో అరెస్టులు తప్ప పరిపాలన ఏమీ లేదన్నారు. రెండు లక్షల 40 వేల కోట్లు అప్పు ఏమైందో తెలియడం లేదు గాని అరెస్టులు మాత్రం రోజూ కనిపిస్తున్నాయని కారుమూరి పేర్కొన్నారు. 3,600 కోట్ల లిక్కర్ స్కామ్ పేరుతో కొండను తవ్వి ఎలకను పట్టారన్నారు. రాష్ట్రంలో మద్యం ఎరులే పారుతుందని విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ మద్యాంధ్రప్రదేశ్ గా, కల్తీ మద్యాంధ్రప్రదేశ్ మార్చారని ఆయన అన్నారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ మొదటిసారిగా కల్తీ మద్యాన్ని పట్టుకున్నారని, అటువంటి వ్యక్తిపై జనార్ధన్ అనే వ్యక్తి పేరు చెప్పాడని కక్షపూరితంగా గౌడ కులస్తుడు బిసిలకు చెందిన నాయకుడు అని చూడకుండా దారుణంగా రమేష్ ని అరెస్టు చేశారన్నారు. రమేష్ కనకదుర్గమ్మ గుడిలో కూడా ప్రమాణం చేశారని అటువంటి వ్యక్తిని కావాలని కక్షతో లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించారని, ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని మండిపడ్డారు. సిటీ మధ్యలో కల్తీ మద్యం నడుస్తూ ఉంటే ఎక్సైజ్ శాఖ ఏమైంది పోలీసు శాఖ ఏమైంది…? మీ ఇంటిలిజెన్స్ ఏమైంది…? అసలు పరిపాలన ఉందా…? అని నేను అడుగుతున్నానని కారుమూరి అన్నారు. మీ ఎమ్మెల్యే లు రాష్ట్రంలో యదేచ్ఛగా దోపిడీ చేస్తూ.. దోచుకుంటున్నారని, ఒకపక్క మద్యం బెల్టు షాపులు, మరో పక్క కల్తీ మద్యం తయారీలు చేస్తుంటే మీ కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇసుక, క్రికెట్ బెట్టింగ్, పేకాట స్థావరాలు, మట్టి, పనికి ఆహార పథకంలో అవినీతి, గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలను చేస్తున్న ప్రభుత్వ అరెస్టులను ఖండిస్తున్నామని కారుమూరి పేర్కొన్నారు.
మాజీ మంత్రి, బీసీ నాయకుడు జోగి రమేష్ అరెస్ట్ అన్యాయం – మాజీ మంత్రి కారుమూరి
03
Nov