లీడర్ న్యూస్ (అత్తిలి, ఇరగవరం) రైతులు ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో మొంథా తుఫాన్ కారణంగా పంట నీటమునగటం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు ఆవేదన వ్యక్తం చేశారు. అత్తిలి, ఇరగవరం మండలల్లో నీట మునిగిన పంట చేలను కారుమూరి పరిశీలించి, రైతులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ….దేశానికి వెన్నుముకగా ఉండే రైతు ఇవాళ శోకసంద్రంలో మునగటం జరిగిందన్నారు. ప్రభుత్వం వారికి పంట నష్ట పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.