ఈనెల 7న తణుకులో రోడ్‌ రన్‌… *టీషర్టు, మెడల్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…                   *******

లీడర్ న్యూస్ (తణుకు) దేశప్రధాని నరేంద్రమోదీ సంకల్పించిన ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా తణుకు రన్నర్స్‌ సొసైటీ భాగస్వామ్యంతో ఈనెల 7న తణుకులో మారథాన్‌ నిర్వహిస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్డు రన్‌కు సంబంధించి టీషర్టు, మెడల్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెల 7న ఉదయం 5.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డితోపాటు ఈవెంట్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పాయల్‌ రాజ్‌పుత్‌ హాజరవుతున్నట్లు చెప్పారు. 3కె, 5కె, 10కె విభాగాల్లో ఈ రోడ్‌ రన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తణుకు పట్టణం క్లీనర్, గ్రీనర్, హెల్దీయర్‌గా ఉండటంతోపాటు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించ తలపెట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2 వేల మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని అన్నారు. ఇంకా రిజిస్ట్రేషన్లు చేయించుకోదలచిన వారు ఈనెల 6న తణుకు ఎన్టీఆర్‌ పార్కులో స్పాట్‌ రిజిస్ట్రేషన్లు చేయించుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్‌ రన్‌ నిర్వాహకులు విశ్వతేజ, సాయిదీప్తి, కృష్ణకిరణ్, వినయ్‌పవన్, తణుకు, అత్తిలి ఏఎంసీ ఛైర్మన్లు కొండేటి శివ, దాసం ప్రసాద్, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ దొమ్మేటి వెంకటసుధాకర్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *