Post Office Jobs: పదో తరగతి తో తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలు .. రాత పరీక్షలేకుండానే ఎంపిక

దేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేయడానికి ఇండియన్ పోస్ట్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా వేల సంఖ్యలో పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికి గానూ గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) పోస్టుల భర్తీకి ఇండియన్ పోస్ట్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది జనవరిలో దాదాపు 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా వేలాది పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కానుంది. రాత పరీక్ష లేకుండానే 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

10వ తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత కార్యాలయంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.. పోస్టును బట్టి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ప్రారంభ వేతనం. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పని గంటలు ఉంటాయి. వీటితో పాటు, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించిన BPM/ABPM/Doc Sevak విధులను కూడా నిర్వహించవచ్చు. ఇందుకోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రోత్సాహకాల రూపంలో అందజేస్తారు. నోటిఫికేషన్ తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *