లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) అధిక వరద ఉదృత కారణంగా పంట నష్టపోయిన రైతులను, ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత , మంత్రులు అచ్చెన్న, నిమ్మల, తణుకు MLA ఆరిమిల్లి, ఆచంట MLA పితానిలతో పాటు జిల్లా అధికారులు పర్యటించారు.
అనంతరం తణుకు మున్సిపల్ సమావేశ మందిరంలో హోం శాఖా మంత్రి అనిత మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలు కారణంగా ఏ ఒక్క రైతు నష్టపోకూడదని, రెవెన్యూ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నీటి ముంపుకు గురైన పంట పొలాలను రి సర్వే చేసి వెంటనే నివేదికలు అందజేయాలన్నారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని స్పష్టం చేశారు.