చదువుల తల్లికి మంత్రి లోకేష్ ఆర్ధిక సాయం

లీడర్ భాస్కర్ న్యూస్(అమరావతి)ప్రజాదర్బార్ ద్వారా తమ వద్దకు వస్తున్న వారికి అవకాశమున్న మేర చేయూతనిస్తూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు మంత్రి నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో మెడిసిన్ జనరల్ ప్రాక్టీషనర్ (ఫిజిషీయన్) 4వ సంవత్సరం చదువుతోంది. గత ప్రభుత్వం విధించిన అడ్డగోలు నిబంధనల కారణంగా కార్తీకకు విదేశీ విద్య ద్వారా ఎటువంటి సాయం అందలేదు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తమబిడ్డ చదువుకు సాయం అందించాల్సిందిగా ఇటీవల కార్తీక తండ్రి శ్రీనివాసరావు ప్రజాదర్బార్లో వినతిపత్రం అందించారు. వెంటనే సంబంధిత విద్యార్థిని వివరాలు తెలుసుకోవాల్సిందిగా లోకేష్ వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టు 14వతేదీ కల్లా కార్తీక 4వసంవత్సరం ఫీజు చెల్లించి కళాశాలకు వెళ్లాల్సిఉంది. విదేశీ విద్య పథకానికి ఇంకా కొత్తగైడ్ లైన్స్ తయారు కాకపోవడంతో ప్రభుత్వం ద్వారా ఆ విద్యార్థినికి నేరుగా సాయం అందించే అవకాశం లేదు. దీంతో మంత్రి లోకేష్ స్పందిస్తూ కార్తీక ట్యూషన్ ఫీజుకు అవసరమైన రూ.1.43 లక్షలను సొంత నిధులనుంచి సమకూర్చాల్సిందిగా వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన చెక్కును మంత్రి లోకేష్ శుక్రవారం సాయంత్రం ఉండవల్లి నివాసంలో కార్తీకకు అందజేశారు. తొలుత ట్యూషన్ పీజు చెల్లించి కళాశాలకు వెళ్లాలని, విదేశీవిద్య పథకానికి నూతన గైడ్ లైన్స్ రూపొందించాక ప్రభుత్వం ద్వారా సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మెడిసిన్ విద్యార్థిని కార్తీక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిబంధనలు అంగీకరించకపోయినా మనసుంటే మార్గం లేకపోదని నిరూపించారు మంత్రి నారా లోకేష్.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *