లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి) టిడిపి కేంద్ర కార్యాలయంలో శనివారం ప్రజలు, కార్యకర్తల నుండి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి బాధితులు, ప్రజలు తరలివచ్చారు. అందరి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. గత వైసిపి ప్రభుత్వం బాధితులైన వేలాదిమంది తమకు న్యాయం చేయాలని సీఎంని వేడుకున్నారు. రాజధాని నిర్మాణానికి, అన్నా క్యాంటీన్ల కోసం దాతలు తమ విరాళాలు నేరుగా సీఎంకి అందజేశారు.
ప్రజలు, కార్యకర్తల నుండి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు…
03
Aug