లీడర్ భాస్కర్ న్యూస్ ( ఉండి ) ఉండి మండలం వాండ్రం గ్రామంలో జరిగిన “ఆంధ్ర ప్రదేశ్ ఫిష్ ట్రేడర్స్ & ప్యాకర్స్ అసోసియేషన్ ” కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణరాజు పాల్గొన్నారు. దాదాపు రూ. 10 కోట్ల ఖర్చుతో తన ప్రాంతంలోని ఆక్వా ఫార్మింగ్ కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా ఈ భవనంలో చక్కని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు , భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు , ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.