లీడర్ భాస్కర్ న్యూస్ (మండపేట) మండపేట MPDO గా కే సత్యనారాయణ మూర్తి గురువారం భాద్యతలు స్వీకరించారు. ఈయన గతంలో 2023 లో మండపేట ఎంపీడీఓ గా చేరి రెండు రోజుకు వ్యవధి లో అంబాజీపేట బదిలీ అయ్యారు. ఎన్నికల విధులు విశాఖ జిల్లా లో నిర్వహించి ఇప్పడు మండపేట బదిలీ అయ్యారు. ఇక్కడ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఎంపి డి ఓ శ్రీదేవి పశ్చిమ గోదావరి జిల్లా కు బదిలీ అయిన విషయం తెలిసిందే.కాగా ఎంపీడి ఓ మూర్తి కి కార్యాలయ ఏ ఓ ప్రసాద్ స్వాగతం పలికారు.కార్యాలయ సిబ్బంది ఉద్యోగులను పరిచయం చేశారు. భాద్యతలు చేపట్టిన మూర్తి మాట్లాడుతూ మండలం లో అన్ని గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు.
ఎంపీడీఓ సత్యనారాయణ మూర్తి భాద్యతలు స్వీకరణ…
22
Aug