వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న తణుకు ఎమ్యెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ…

లీడర్ భాస్కర్ న్యూస్ (విజయవాడ)ఇటివల కురిసిన భారీ వర్షాలకు విజయవాడలోని భారీగా వరద నీరు చేరడంతో మునిగిన ప్రాంతాలలో తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చూపే చర్యలు చేపట్టడంతో పాటు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలలో పాల్గొని విజయవాడ 32 వ డివిజన్ లో బాధితులకు భోజనం, త్రాగునీరు ఇతర నిత్యావసరాలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *