లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. శనివారం తాడేపల్లిగూడెంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తిరుమల లడ్డూలో నాణ్యతా లోపం ఉంటే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి కాని గత ప్రభుత్వంపై నిందమోపడం సరికాదన్నారు. వంద రోజుల చేతకాని పాలనపై ప్రజలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని దానిని దారి మళ్లించడానికి తప్పుడు రాజకీయం చేస్తున్నారన్నారు.