లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం)వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి సర్కార్పై పోరుబాటలో భాగంగా, ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉండాలని, రైతులకు సంబందించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేయటం జరిగిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు అన్నారు. ఆ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు, నరసాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ముదునూరి ప్రసాదరాజు , కొట్టు సత్యనారాయణ , నరసాపురం పార్లమెంట్ ఇంచార్జి గూడూరి ఉమాబాల , ఎమ్మెల్సీలు వంక రవీంద్ర , కవురు శ్రీనివాస్ , పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల హరగోపాల్ రావు , ఉండి నియోజకవర్గ ఇంచార్జ్ పివియల్ నరసింహరాజులతో కలసి పాల్గొనటం జరిగిందని తెలిపారు.